యాప్నగరం

పెళ్లి మేళా.. ఆ వధువుకు చావు మేళా అయ్యింది!

ఆ పెళ్లి కూతురి పాలిట.. పెళ్లి మేళా చావు మేళా అయ్యింది. అప్పటి వరకు ఎంతో సందడిగా కనిపించిన.. ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాదంతో నిండిపోయింది.

Samayam Telugu 11 Mar 2018, 12:44 pm
పెళ్లి కూతురి పాలిట.. పెళ్లి మేళా చావు మేళా అయ్యింది. అప్పటి వరకు ఎంతో సందడిగా కనిపించిన.. ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాదంతో నిండిపోయింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. సూర్యాపేటలోని శంకర్ విలాస్ సెంటర్ సమీపంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు హనుమయ్య కుమార్తె గాయత్రి (23)ను వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన వేణుతో పెళ్లి చేశారు.
Samayam Telugu bride killed in wedding ceremony
పెళ్లి మేళా.. ఆ వధువుకు చావు మేళా అయ్యింది!


పెళ్లి తర్వాత వధువురులు ఇద్దరు స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. దైవ దర్శనం తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో డీజే ఏర్పాటు చేశారు. అయితే, ఆ భారీ శబ్ధాలకు వధువుకు గుండె పోటు వచ్చి కుప్ప కూలింది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.