బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సూరారం కాలనీలో నివసిస్తున్న చంద్రం, రేణుక దంపతుల కుమార్తె మౌనిక స్థానిక నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. బుధవారం (అక్టోబర్ 11) సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చంద్రం, రేణుక 20 ఏళ్ల కిందట నగరానికి వచ్చి సూరారం కాలనీలో స్థిరపడ్డారు. ఈ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా విడివిడిగా జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు మౌనిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టేటస్ అప్లోడ్ చేసింది. ‘నా జీవితం దుర్భరంగా తయారైంది.. నేను సంతోషంగా ఉండటం చుట్టుపక్కలవారు చూడలేకపోతున్నారు. దీనికి ముగింపు పలుకుతాను’ అంటూ ఆమె పోస్టు పెట్టింది. ఆ తర్వాత ఉరేసుకుని తనువు చాలించింది.
బుధవారం ఉదయం మౌనికకు తన తమ్ముడితో వాగ్వాదం జరిగినట్లు ఆమె తల్లి తెలిపారు. ఈ విషయంలో మౌనికను ఆమె తల్లి మందలించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు మౌనిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టేటస్ అప్లోడ్ చేసింది. ‘నా జీవితం దుర్భరంగా తయారైంది.. నేను సంతోషంగా ఉండటం చుట్టుపక్కలవారు చూడలేకపోతున్నారు. దీనికి ముగింపు పలుకుతాను’ అంటూ ఆమె పోస్టు పెట్టింది. ఆ తర్వాత ఉరేసుకుని తనువు చాలించింది.
బుధవారం ఉదయం మౌనికకు తన తమ్ముడితో వాగ్వాదం జరిగినట్లు ఆమె తల్లి తెలిపారు. ఈ విషయంలో మౌనికను ఆమె తల్లి మందలించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.