యాప్నగరం

Hyderabad: నిజాం మ్యూజియంలో చోరీ

నిజాం మ్యూజియంలో దొంగతనం జరిగింది. మ్యూజియంలో చొరబడిన దొంగలు విలువైన వస్తువుల్ని చోరీ చేశారు.

Samayam Telugu 4 Sep 2018, 11:08 am
హైదరాబాద్‌ డబీర్‌పురాలోని నిజాం మ్యూజియంలో చోరీ కలకలంరేపింది. ఆదివారం రాత్రి మ్యూజియంలోకి చొరబడిన దొంగలు విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. చోరీ అయిన వస్తువుల్లో బంగారు పూత ఉన్న టీకప్పు, సాసర్, స్పూన్, బాక్స్ ఉన్నట్లు తేలింది. చోరీ చేసిన వస్తువుల్లో టిఫిన్ బాక్స్ బరువు 2 కేజీల వరకు ఉంటుందని మ్యూజియం సిబ్బంది చెబుతున్నారు. వస్తువులు కనిపించకుండా పోవడంతో షాకైన మ్యూజియం సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్‌ను పరిశీలించారు. దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
Samayam Telugu Theft


దొంగతనం జరిగిన స్పాట్‌ను సీపీ అంజనీ కుమార్‌తో పాటూ పోలీసు అధికారులు పరిశీలించారు. మ్యూజియం మొదటి ఫ్లోర్‌లోని గ్రిల్స్‌ను తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.
ఈ మ్యూజియంలో నిజాం నాటి రాజులు ఉపయోగించిన వస్తువుల్ని ప్రదర్శనకు ఉంచారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాతమ్రే సందర్శకుల్ని అనుమతిస్తారు. కాబట్టి అర్థరాత్రి సమయంలో దొంగలు చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.