యాప్నగరం

కాలువలో పడ్డ బస్సు.. తప్పిన ప్రమాదం!

ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కాలువలోకి పడిపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రయాణికులు అప్రమత్తమవడంతో.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

Samayam Telugu 22 Jul 2018, 1:18 pm
ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కాలువలో పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రయాణికులు అప్రమత్తమవడంతో.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వారిని గుడివాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన వివారాల్లోకి వెళ్తే.. ఆదివారం (జులై 22) ఉదయం హైదరాబాద్ నుండి 40 మంది ప్రయాణికులతో నర్సాపురం వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. పెదపారుపూడి మండలం వానపాముల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా కొట్టింది.
Samayam Telugu BUS


ఈ ఘటనతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వారంతా వెంటనే అప్రమత్తమై.. ఎవరికి వారే బస్సు అద్దాలు పగులగొట్టుకొని బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రెవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ఇద్దరు డ్రెవర్లు కనీసం రక్షించే ప్రయత్నం కూడా చేయకుండా అక్కడి నుంచి పరారయ్యారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులను వేరే బస్సుల్లో స్వస్థలాలకు పంపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.