యాప్నగరం

పార్టీ మార్పు.. బైరెడ్డి ప్రకటన..!

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అనంతరం.. ఏపీలో రాజకీయ మార్పులు తప్పవని స్పష్టం

TNN 5 Sep 2017, 2:59 pm
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అనంతరం.. ఏపీలో రాజకీయ మార్పులు తప్పవని స్పష్టం అయ్యింది. ప్రత్యేకించి అక్కడ రెండే పార్టీలు పోరాడాయి.. మిగతా పార్టీలది కేవలం ప్రేక్షక పాత్రే అయ్యింది. అలాంటి పాత్ర పోషించిన పార్టీలు కాంగ్రెస్, రాయలసీమ పరిరక్షణ సమితిలు. నంద్యాల్లో గణనీయంగా ఉన్న ముస్లింల ఓట్లను పొందాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థితో రంగంలోకి దిగింది. ఇక ప్రత్యేక రాయలసీమ వాదంతో రాయలసీమ పరిరక్షణ సమితి రంగంలోకి దిగింది. అయితే ఈ పార్టీలు డిపాజిట్లే కాదు.. చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను కూడా సాధించుకోలేకపోయాయి.
Samayam Telugu byreddy looking to merge his party into another
పార్టీ మార్పు.. బైరెడ్డి ప్రకటన..!


కాంగ్రెస్ వెయ్యి ఓట్ల చిల్లరకు పరిమితం అయితే.. రాయలసీమ పరిరక్షణ సమితి మరీ దారుణంగా కేవలం 150 ఓట్ల చిల్లరకు పరిమితం అయ్యింది. కనీసం బూత్ ఒక ఒక్క ఓట్ ను కూడా సంపాదించుకోలేకపోయింది ఈ పార్టీ. ఈ నేపథ్యంలో ఈ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం లో చేరనున్నాడనే మాట వినిపిస్తోంది. గతంలో ఈయన తెలుగుదేశంలో పనిచేసిన వ్యక్తే. ఈ నేపథ్యంలో బైరెడ్డి మళ్లీ టీడీపీలో చేరనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా తన సొంతూరు ముచ్చుమర్రిలో తన అనుచరగణంతో సమావేశం అయ్యాడు బైరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాయలసీమ వాదాన్ని ప్రజలు తిరస్కరించారన్నారు. త్వరలోనే వేరే పార్టీలో చేరతానని ప్రకటించారు. ఇంతకీ ఏ పార్టీ అంటే.. రాయలసీమకు మేలు చేసే పార్టీలో అని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే స్పష్టతను ఇస్తానన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.