యాప్నగరం

సారస్వత పరిషత్‌లో సినారె పార్థీవ దేహం..

ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు సినారే భౌతికకాయం సారస్వత్ పరిషత్‌లోనే ఉండనుంది.

TNN 14 Jun 2017, 11:35 am
సినారె భౌతికకాయాన్ని బొగ్గులకుంటలోని సారస్వత్ పరిషత్‌కు తరలించారు. పుప్పాల గూడలోని ఆయన స్వగృహం వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించిన అనంతరం ప్రత్యేక వాహనంలో ఆయన పార్థీవ దేహాన్ని తరలించారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు సినారే భౌతికకాయం సారస్వత్ పరిషత్‌లోనే ఉండనుంది. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, టోలీచౌకి మీదుగా అంతిమయాత్ర సాగనుంది. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనికి సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు.
Samayam Telugu c narayana reddy corpse shifted to telangana saraswata parishad
సారస్వత పరిషత్‌లో సినారె పార్థీవ దేహం..


అంతకు ముందు గవర్నర్ నరసింహన్.. సినారె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రవీంద్రభారతిలో సినారె, తాను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నామని తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లో తనను ఇంటి పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి సినారె అని గవర్నర్ పేర్కొన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నా ఆయన సాధారణ వ్యక్తిలాగే జీవించారని తెలిపారు. సినారె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.