యాప్నగరం

ముగ్గురిని బలిగొన్న నిర్లక్ష్యం

ఔటర్ రింగు రోడ్డు ప్రమాదాలకి నెలవుగా మారింది. ఒక ఘటన మరవక ముందే మరొక ఘటనతో నిత్యం....

Samayam Telugu 13 Jul 2017, 8:18 pm
ఔటర్ రింగు రోడ్డు ప్రమాదాలకి నెలవుగా మారింది. ఒక ఘటన మరవక ముందే మరొక ఘటనతో నిత్యం ఔటర్ రింగు రోడ్డు ఏదో ఓ చోట రక్తమోడుతూనే వుంది. తాజాగా గురువారం నాడు ఔట‌ర్ రింగ్ రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Samayam Telugu car accident took three lives on hyderabad outer ring road
ముగ్గురిని బలిగొన్న నిర్లక్ష్యం


రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపై డివైడర్‌ను ఢీకొన్న కారు అనంత‌రం ప‌ల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంతో కారులో ప్రయాణిస్తోన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని గాయాల‌పాల‌యిన క్షతగాత్రుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదానికి గురైన కారు నెంబరు AP 29 BV 5472 ఆధారంగా మృతుల కుటుంబసభ్యులకి స‌మాచారం అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.