కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ పై హైదరాబాద్-జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలంగాణ పోలీసులే ముస్లిం యువత తీవ్రవాదం బాటపట్టేలా రెచ్చగొడుతున్నారని దిగ్విజయ్ సింగ్ ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దిగ్గీరాజా వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు, మంత్రులతో పాటు బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలు తీవ్రంగా ఖండించారు. పోలీసులు యువతను తీవ్రవాదం వైపు మళ్లేలా రెచ్చగొడుతున్నారనడానికి ఆధారాలు బయటపెట్టాలని నేతలు డిగ్గీరాజాను డిమాండ్ చేశారు.
తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యల చేసిన దిగ్విజయ్ పై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మొన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయనిపుణుల సలహా తీసుకున్న పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
దిగ్గీరాజా వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు, మంత్రులతో పాటు బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలు తీవ్రంగా ఖండించారు. పోలీసులు యువతను తీవ్రవాదం వైపు మళ్లేలా రెచ్చగొడుతున్నారనడానికి ఆధారాలు బయటపెట్టాలని నేతలు డిగ్గీరాజాను డిమాండ్ చేశారు.
తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యల చేసిన దిగ్విజయ్ పై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మొన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయనిపుణుల సలహా తీసుకున్న పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.