యాప్నగరం

గుంటూరులో ‘జనతాగ్యారేజ్’.. 23 మందిపై కేసు నమోదు

‘జనతా గ్యారేజీ’ పేరుతో ప్రదీప్‌ అనే యువకుడు కత్తి పట్టుకుని స్థానికులను భయబ్రాంతులకు గురిచేసిన కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.

Samayam Telugu 10 Nov 2018, 8:19 pm
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ మూవీలో ప్రజల సమస్యలు పరిష్కరించిన తరహాలో గుంటూరు జిల్లాలో కొందరు యువకులు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో ‘జనతా గ్యారేజీ’ పేరుతో ప్రదీప్‌ అనే యువకుడు కత్తి పట్టుకుని స్థానికులను భయబ్రాంతులకు గురిచేసిన కేసులో మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Samayam Telugu Janatha Garage Whatsapp Group


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లికి చెందిన గాజుల సాయి సురేష్‌‌పై ఇటీవల దాడి జరిగింది. తనపై దాడి కేసులో ప్రదీప్‌తో పాటు 23మందిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జనతా గ్యారేజీ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 5వ తేదీన ఉండవల్లిలో ప్రదీప్ అనే యువకుడు నడిరోడ్డుపై కత్తితో తిరుగుతూ.. నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కరిస్తానని ఫోన్‌లో మాట్లాడటం కలకలం రేపింది.

‘జనతా గ్యారేజీ’ సభ్యులకు పోలీసుల కౌన్సెలింగ్
ఉండవల్లికి చెందిన యువకులు జనతాగ్యారేజీ పేరుతో ఓ వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసి, ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ మూవీని తలపించడంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రదీప్, అతడి అనుచరులకు నార్త్‌జోన్‌ డీఎస్పీ జి.రామకృష్ణ ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. 25 మంది సభ్యులున్న ఈ వాట్సాప్ గ్రూపులో ఓ ఇద్దరు తప్ప, అంతా అమాయకులేనని తేలడంతో వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మరోసారి ఇలాంటి గ్రూపులలో సభ్యులుగా చేరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కౌన్సెలింగ్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.