ఎన్నికల ముంగిట ఓటుకు నోటు కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ నేత వేం నరేందర్రెడ్డి, ఆయన కుమారులను సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ విచారించింది. అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వేం నరేందర్రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షల లెక్కలపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి, ఉదయ్సింహను ఇప్పటికే ఈడీ విచారించిన విషయం తెలిసిందే. మూడున్నరేళ్ల తర్వాత ఈ కేసును ఈడీ దర్యాప్తు వరకు తీసుకెళ్లడం మాకేమీ అర్థం కావడం లేదని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి. ప్రభుత్వాలు ఇబ్బందులు కలిగిస్తాయి. కానీ రాజకీయాలతో సంబంధం లేని పిల్లలను కూడా ఈ కేసులోకి లాగడం బాధకరమని ఆయన మీడియాతో భావోద్వేగంగా మాట్లాడారు. ఈ కేసుతో మా పిల్లలకు సంబంధం ఏంటో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈడీ నోటీసులన్నింటికీ బదులిచ్చామన్న వేం నరేందర్ రెడ్డి.. భవిష్యత్తులోనూ దర్యాప్తునకు సహకరిస్తామన్నారు. అణగదొక్కే ప్రయత్నంలోనే ఇలా చేశారన్న వేం నరేందర్ రెడ్డి.. రాష్ట్ర దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గరకు ఎందుకు తీసుకెళ్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి మరోసారి నోటీసులు అందినట్టు తెలుస్తోందని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో రేవంత్ ఈడీ ముందుకు హాజరవుతారని ఆయన చెప్పారు.
ఈడీ నోటీసులన్నింటికీ బదులిచ్చామన్న వేం నరేందర్ రెడ్డి.. భవిష్యత్తులోనూ దర్యాప్తునకు సహకరిస్తామన్నారు. అణగదొక్కే ప్రయత్నంలోనే ఇలా చేశారన్న వేం నరేందర్ రెడ్డి.. రాష్ట్ర దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గరకు ఎందుకు తీసుకెళ్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి మరోసారి నోటీసులు అందినట్టు తెలుస్తోందని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో రేవంత్ ఈడీ ముందుకు హాజరవుతారని ఆయన చెప్పారు.