యాప్నగరం

సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ ఉత్కంఠకు తెర పడింది.

TNN 28 Apr 2017, 1:32 pm
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ ఉత్కంఠకు తెర పడింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలంటూ.. సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసి పుచ్చింది. సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సీబీఐ చూపిన ఆధారాలతో బెయిల్‌ రద్దు చేయలేమని పేర్కొంటూ.. దర్యాప్తు సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చింది.
Samayam Telugu cbi court cansells bail quash petition on jagan
సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట


దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘కోర్టులపై మాకు పూర్తి విశ్వాసం ఉంది, జగన్‌కు న్యాయం జరుగుతుంది’ అని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.