యాప్నగరం

చంద్రబాబు ‘నల్లధనం’వ్యాఖ్యలపై జగన్ ఫైర్

ఆదాయ వెల్లడి పథకం-2016పై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Samayam Telugu 13 Oct 2016, 3:55 pm
ఆదాయ వెల్లడి పథకం-2016పై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Samayam Telugu cbn must have proxy to hold black money ys jagan write to pm
చంద్రబాబు ‘నల్లధనం’వ్యాఖ్యలపై జగన్ ఫైర్

ఆదాయాన్ని వెల్లడించిన వారి వివరాలు బయటపెట్టబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చెబుతుంటే...చంద్రబాబు మాత్రం వారి పేర్లు ఎలా చెబుతున్నారని జగన్ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వ్యక్తి రూ.10వేలకోట్లు నల్లధనాన్ని వెల్లడిస్తూ పన్ను కట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అంత కచ్చితంగా ఒక వ్యక్తి రూ.10వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లించారని చెబుతున్నారంటే అది ఆయన బినామీ అయ్యి ఉండాలి అని జగన్ దుయ్యబట్టారు.
ఈ మేరకు జగన్ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. ఆదాయాన్ని ప్రకటించిన వారందరి పేర్లు ప్రకటించాలని ఆయన లేఖలో కోరారు. నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించినవారి పేర్లు బయటికి ప్రకటించకపోయినా చంద్రబాబుకు మాత్రం ఎలా తెలుస్తున్నాయని జగన్ ప్రశ్నించారు.
లక్షన్నర కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబుపై చర్య తీసుకోవాలని గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసి ఇప్పటి వరకు ఏలాంటి స్పందన లేదని ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు.

నల్లధనంతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని అందుకు సంబంధించి ఆడియో,వీడియో టేపులున్నాయని గుర్తు చేసిన జగన్...చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాలని పీఎంకు మోదీ విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.