యాప్నగరం

మనమే శాశ్వతంగా అధికారంలో ఉండాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే శాశ్వతంగా అధికారంలో ఉండాలని టీడీపీ అధినేత, సీఎం

Samayam Telugu 17 Feb 2017, 11:12 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే శాశ్వతంగా అధికారంలో ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేస్తే టీడీపీ ఎల్లప్పుడూ అధికారంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu cbn says tdp should remain in the power for ever
మనమే శాశ్వతంగా అధికారంలో ఉండాలి


విజయవాడలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఆయన పాల్గొన్ని ప్రసంగించారు.

తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో భూములు తప్ప మరేమీ లేవని..తాను అన్నివిధాల అభివృద్ధి చేశానని చెప్పిన బాబు...సంవత్సరంలోపే కృష్ణా జలాలు నగరానికి తరలించే ఏర్పాట్లు చేశానని గుర్తు చేశారు.

నవ్యాంధ్ర రాజధాని అమరాతి నిర్మాణాన్ని ఎన్నో ఇబ్బందులున్నాయని...భూములు లేకపోవడంతో..ల్యాండ్ ఫూలింగ్ ద్వారా భూసేకరణ చేపట్టామని చెప్పారు. అమరావతిని దేశంలోనే కాదు ప్రపంచంలో మోడ్రన్ సిటీగా తీర్చిదిద్దుతానని బాబు అన్నారు.

పార్టీ నేతల మధ్య విబేధాలు ఉండరాదని.. నేతల మధ్య గొడవలుంటే ప్రజల్లో చులకనైపోతారని...మీడియా కూడా ఏదేదో రాస్తుందని అప్పుడు పార్టీకి ఇబ్బందులు వస్తాయని ఆయన నేతలను హెచ్చరించారు. నేతలు ప్రజలు, కార్యకర్తలకు ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని..స్థానికంగా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన నేతలు, కార్యకర్తలకు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.