యాప్నగరం

ఏపీలో వ్యవసాయ వర్శిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర విభజనతో ఇబ్బందుల్లో పడ్డ ఏపీని ఆదుకునే చర్యలను కేంద్రం ముమ్మరం చేసింది.

TNN 20 Apr 2016, 2:34 pm
రాష్ట్ర విభజనతో ఇబ్బందుల్లో పడ్డ ఏపీని ఆదుకునే చర్యలను కేంద్రం ముమ్మరం చేసింది.ఈ చర్యల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో వ్యవసాయ వర్శిటీ ఏర్పాటు, టొబాకో రీసెర్చి సెంటర్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే తిరుపతిలో ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్ (ఐఐఎస్సీ)కి రూ.137 కోట్ల నిధులు మంజారూ చేసింది. విభజనతో ప్రముఖ విద్యాసంస్థలన్నీ తెలంగాణకి చెందడం.. ఏపీలో విద్యాసంస్థల కొరత ఏర్పడటంతో కేంద్రం ​ఈ మేరకు విద్యాసంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. కాగా తాజా నిర్ణయంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.