యాప్నగరం

ఏపీకి కేంద్రం షాక్.. పోలవరం నిధుల్లో కోత

ప్రత్యేక హోదా విషయంలో రగిలిపోతున్న ఏపీకి కేంద్రం మరో షాకిచ్చింది. రెండు రోజుల్లోనే పోలవరానికి ఇస్తున్న నిధుల్లో కోత పెట్టింది.

Samayam Telugu 22 Mar 2018, 4:27 pm
ప్రత్యేక హోదా విషయంలో రగిలిపోతున్న ఏపీకి కేంద్రం మరో షాకిచ్చింది. రెండు రోజుల్లోనే మాట తప్పి... పోలవరానికి ఇస్తున్న నిధుల్లో కోత పెట్టింది. పోలవరానికి సంబంధించి నాబార్డు ద్వారా రూ.1400కోట్లు తీసుకునేందుకు ముందు అనుమతిని ఇచ్చారు. అయితే నిధుల్లో రూ.311 కోట్లు కోత పెట్టారు. అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.1089మాత్రమే ఇవ్వాలని జలవనరులశాఖ ఆదేశించింది. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యననే విమర్శలు వినిపిస్తున్నాయి.
Samayam Telugu Polavaram Funds


ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంటోంది. హైవేలను కూడా దిగ్బంధించి నిరసన తెలియజేశారు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్లు నిధుల్లో కోత పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై టీడీపీ నేతలు కూడా మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.