యాప్నగరం

సింగరేణి సంస్థపై పీయూష్ గోయల్ సమీక్ష

కేంద్ర రైల్వే, బొగ్గు, గనులశాఖ మంత్రి పీయూష్‌గోయల్ నగరంలోని సింగరేణి భవన్‌లో సింగరేణి సంస్థపై శుక్రవారం (జూన్ 15) సమీక్ష నిర్వహించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంస్థ ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి వివరించారు.

Samayam Telugu 16 Jun 2018, 1:51 am
కేంద్ర రైల్వే, బొగ్గు, గనులశాఖ మంత్రి పీయూష్‌గోయల్ నగరంలోని సింగరేణి భవన్‌లో సింగరేణి సంస్థపై శుక్రవారం (జూన్ 15) సమీక్ష నిర్వహించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంస్థ ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి వివరించారు. సింగరేణి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. కోల్ ఇండియాలో లేని విధంగా కంపెనీలో కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అభినందించారు. సింగరేణి అభివృద్ధికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.