యాప్నగరం

టీడీపీది తొందరపాటు..వైసీపీ వస్తే ఆహ్వానిస్తాం: కేంద్రమంత్రి

ఏపీ రాజకీయాలపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన... హోదా, విభజన హామీలు సహా కీలక అంశాలపై స్పందించారు.

Samayam Telugu 26 Apr 2018, 2:17 pm
ఏపీ రాజకీయాలపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన... హోదా, విభజన హామీలు సహా కీలక అంశాలపై స్పందించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం తొందరపాటు చర్యని... 2019లో వారు తిరిగి వస్తే బావుంటందని వ్యాఖ్యానించారు అథవాలే. అయితే మంత్రి వైసీపీ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఏపీలో వైసీపీ కూడా బలమైన పార్టీ అని... వారు ఎన్డీఏలోకి వస్తామంటే ఆహ్వానిస్తామన్నారు. అయితే ఇవి తన వ్యక్తిగత వ్యాఖ్యల్ని కూడా అన్నారు. జగన్‌పై కేసుల్ని ప్రస్తావించగా... అవి నిరూపితం కాలేదని చెప్పుకొచ్చారట.
Samayam Telugu Ramdas


ప్రత్యేక హోదా అంశంపై కూడా ఆయన స్పందించారు. ఏపీకి ఇస్తే... మిగిలిన రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతందన్నారు. దానికి బదులు ఏపీకి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు అథవాలే. ఇప్పటికే విద్యుత్, ఇరిగేషన్, రోడ్లకు సంబంధించి రూ.లక్షకోట్లు కేటాయించామని... మరిన్ని నిధులు కూడా కేటాయిస్తామన్నారు. ఏపీలో కాపులకు రిజర్వేషన్లను సమర్థిస్తున్నానని... ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు ఇవ్వాలని రాందాస్‌ అథవాలే అభిప్రాయపడ్డారు. మొత్తం మీద కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.