యాప్నగరం

చంద్రబాబు వైఖరితో డైలమాలో పడ్డ కేంద్రం !

ప్రత్యేక హోదా అంశాన్ని తెరదించుతూ ప్యాకేజీ ప్రకటించాలన్న కేంద్రం.. చంద్రబాబు తీసుకున్న తాజా వైఖరితో డౌలమాలో పడింది.

TNN 7 Sep 2016, 5:59 pm
హైదరాబాద్: ప్రత్యేక హోదా కథ మళ్లీ మొదటికి వచ్చినట్లుగా ఉంది. ఈ రోజు దీనిపై ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఏపీ ప్రజలందరూ ఎదురు చూశారు. అయితే దీనిపై ప్రకటన చేసే సాహసం కేంద్రం చేయలేకపోయింది. వాస్తవానికి కేంద్రం ప్రత్యేక హోదా అంశాన్ని తెరదించుతూ.. ఏపీకి ఇచ్చే ప్యాకేజీపై ఈ రోజు ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీకి రమ్మని ఆహ్వానించింది. అయితే దీనిపై చర్చకు వెళ్లేందుకు సిద్ధంగా లేనని చంద్రబాబు ప్రకటించడంతో ప్యాకేజీపై కేంద్రం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. హోదా ప్రయోజనాలను కూర్చి ఓ ప్యాకేజీగా తయారు చెసినట్లు కేంద్రం చెబుతున్నా... దానిలోని వివరాలు తెలియకుండా తాము స్పందించబోమని చంద్రబాబు తేల్చిచెప్పడంతో ప్యాకేజీపై కేంద్రం డైలమాలో పడింది.
Samayam Telugu centre to defer its decision on the special package for ap
చంద్రబాబు వైఖరితో డైలమాలో పడ్డ కేంద్రం !


అసలు కథ ఇది...
ప్రత్యేక హోదా నే ప్రధానాంశంగా మారిన తరుణంలో ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకుంటే త్వరలో జరగనున్న కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని గ్రహించిన చంద్రబాబు .. తన ఆలోచనను బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉంచారు. చంద్రబాబు ఆలోచనతో మంత్రులంతా ఏకీభవించారు. దీంతో ప్యాకేజీపై కేంద్ర జరిపే చర్చలకు వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ రావాలని కేంద్రం పెద్దల ఆహ్వానాన్ని అందుకే తిరస్కరించినట్లు తెలిసింది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.