విభజన చట్టం, ప్రత్యేక హోదా ఐదుకోట్ల ఆంధ్రుల హక్కన్నారు సీఎం చంద్రబాబు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆంధ్రులకు ఆత్మగౌరవం ఇస్తే.. తాను ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశానన్నారు. తనకు ఎలాంటి భయం లేదని... ఎలాంటి లాబీయింగ్ చేయలేదన్నారు. కేంద్రాన్ని గవర్నర్ పదవో, మంత్రి పదవో, కార్పోరేషన్ పదవో అడిగానా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల గురించే తన పోరాటమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని అడగడానికి బీజేపీ నేతలకు మొహమాటం ఉందేమో కాని తనకు మాత్రం లేదన్నారు. సీమాంధ్ర రెవెన్యూ లోటును తప్పకుండా భర్తీ చేయాలని రాజ్యసభలో ఆనాడు ప్రతిపక్ష నేతగా జైట్లీ ప్రకటన చేశారు. ఇప్పడు ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో గమనించాలన్నారు.
సెంటిమెంట్తో డబ్బు రావని చెబుతున్న కేంద్రమంత్రి అరుణ్జైట్లీకి... సెంటిమెంట్తోనే రాష్ట్రాన్ని విభజించిన సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రత్యేక హోదాకు వచ్చే ప్రయోజనాలన్నీ ఇస్తామని హామీ ఇస్తేనే ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామన్నారు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్న తనకు... బీజేపీ నేతలు రాజకీయాలు నేర్పుతున్నారన్నారు. 60ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తి వేరెవరికో వెళ్తే బాధ కలగదా?. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది అదే పరిస్థితిలో ఉందన్నారుసీఎం. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వారు చెప్పడం సరికాదని... హోదా ఉన్న రాష్ట్రాలకు ఏటా రాయితీలు, నిధులు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు, కేంద్రంలో తమ మంత్రులు రాజీనామా చేశారు. ఈ సందర్భంలోనే విశాఖకు రైల్వేజోన్ ఇవ్వలేమని ఓ రైల్వే అధికారి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు బాబు. కేంద్రానికి ఒక నిర్దిష్టమైన రాజకీయ విధానం ఉందా అని ప్రశ్నించారు. అధికారుల నిర్ణయాలే కాదు.. రాజకీయంగా విధాన నిర్ణయాలు కూడా పాలనలో ముఖ్యమని చెప్పారు. అసంబద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ను ప్రజలు తుడిచిపెట్టేశారు. ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నానన్నారు. అప్పటి ప్రధానమంత్రి ఏం చెప్పారో.. తర్వాత ప్రధాని అయిన మోదీ ఏం హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాన్నారు చంద్రబాబు.
సెంటిమెంట్తో డబ్బు రావని చెబుతున్న కేంద్రమంత్రి అరుణ్జైట్లీకి... సెంటిమెంట్తోనే రాష్ట్రాన్ని విభజించిన సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రత్యేక హోదాకు వచ్చే ప్రయోజనాలన్నీ ఇస్తామని హామీ ఇస్తేనే ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామన్నారు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్న తనకు... బీజేపీ నేతలు రాజకీయాలు నేర్పుతున్నారన్నారు. 60ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తి వేరెవరికో వెళ్తే బాధ కలగదా?. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది అదే పరిస్థితిలో ఉందన్నారుసీఎం. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వారు చెప్పడం సరికాదని... హోదా ఉన్న రాష్ట్రాలకు ఏటా రాయితీలు, నిధులు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు, కేంద్రంలో తమ మంత్రులు రాజీనామా చేశారు. ఈ సందర్భంలోనే విశాఖకు రైల్వేజోన్ ఇవ్వలేమని ఓ రైల్వే అధికారి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు బాబు. కేంద్రానికి ఒక నిర్దిష్టమైన రాజకీయ విధానం ఉందా అని ప్రశ్నించారు. అధికారుల నిర్ణయాలే కాదు.. రాజకీయంగా విధాన నిర్ణయాలు కూడా పాలనలో ముఖ్యమని చెప్పారు. అసంబద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ను ప్రజలు తుడిచిపెట్టేశారు. ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నానన్నారు. అప్పటి ప్రధానమంత్రి ఏం చెప్పారో.. తర్వాత ప్రధాని అయిన మోదీ ఏం హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాన్నారు చంద్రబాబు.