యాప్నగరం

తమ్ముళ్లు శాంతించాలంటున్న చంద్రబాబు

సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. మిత్రపక్షాల మధ్య మాటల తూటాలు పేలడంతో... చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. శాతించండంటు తెలుగు తమ్ముళ్లకు హితబోధ చేశారు.

TNN 5 Feb 2018, 5:27 pm
సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. మిత్రపక్షాల మధ్య మాటల తూటాలు పేలడంతో... చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. శాతించండంటు తెలుగు తమ్ముళ్లకు హితబోధ చేశారు. క్రమశిక్షణ గల పార్టీగా... సంయమనం పాటించాలని నేతలు, కార్యకర్తల్ని ఆదేశించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిచవద్దని సూచించారు. మిత్ర ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత. ఇకపై ఎవరూ వీర్రాజు దిష్టిబొమ్మను దగ్థం చేయొద్దన్నారు. అలాగే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపైనా బాబు ఆరా తీశారట.
Samayam Telugu chandra babu on mlc somu veerraju comments
తమ్ముళ్లు శాంతించాలంటున్న చంద్రబాబు


రెండు రోజులుగా సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారాన్నే రేపాయి. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆయనపై మండిపడ్డారు. అక్కడక్కడా దిష్టిబొమ్మల్ని కూడా తగులబెట్టారు. ఆ తర్వాత కూడా వీర్రాజు మళ్లీ మాటలతో ఎదురు దాడికి దిగారు. మళ్లీ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ మాటల యుద్ధానికి ఇప్పట్లో పుల్‌స్టాప్ పడదనుకునే సమయంలో... స్వయంగా టీడీపీ అధినేతే రంగంలోకి దిగారు. తమ్ముళ్లన్ని శాంతింప చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.