యాప్నగరం

గ్లోబల్ ఫండ్‌ను సాయం కోరిన చంద్రబాబు

డెంగీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు సాయం చేయాలని చంద్రబాబు ‘గ్లోబల్ ఫండ్’ సంస్థను కోరారు.

TNN 18 Jan 2017, 5:53 pm
ఆంధ్రప్రదేశ్ లో డెంగీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘గ్లోబల్ ఫండ్’ సంస్థను కోరారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన గ్లోబల్ ఫండ్ విదేశీ వ్యవహారాల సంచాలకుడు క్రిస్టోఫర్ బెన్ తో చర్చలు జరిపారు. తమ రాష్ట్రంలో మలేరియా, డెంగీలను అంతమొందించేందుకు కృషి చేయాలని కోరారు. క్రిస్టోఫర్ బెన్ మాట్లాడుతూ వివిధ దేశాల్లో మలేరియా, క్షయ, ఎయిడ్స్ వంటి వ్యాధుల నిర్మూలనకు తమ సంస్థ నుంచి నిధులు అందించామని, భవిష్యత్తులో కూడా అందిస్తూనే ఉంటామని తెలిపారు. త్వరలో ఇండియా హెల్త్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామని, ఆ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని ఆయన చంద్రబాబును కోరారు.
Samayam Telugu chandrababu asked global funds help to fight against dengue
గ్లోబల్ ఫండ్‌ను సాయం కోరిన చంద్రబాబు


అనంతరం మరొక సంస్థ ఆర్య క్యాపిటల్ పార్టనర్స్ వ్యవస్థాపకుడు సునీత్ భగత్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సంస్థ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. విమానాశ్రయాలు, మౌలిక సదుపాయల కల్పన రంగంలో ఈ సంస్థ ఆసక్తి చూపిస్తోంది. కనుక ఏపీలో అడుగుపెట్టే విషయమై చంద్రబాబుతో సునీల్ భగత్ చర్చించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.