పోరాడితే పోయేదేముంది... అనుకున్న సాధించడం తప్ప. ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బడ్జెట్ తర్వాతి పరిణామాలపై చర్చించేందుకు.... అమరావతిలో పార్టీ ఎంపీలతో భేటీ నిర్వహించారు. సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశా నిర్దేశం చేశారు. కేంద్రం తీరుపై ఎంపీలు మండిపడినట్లు తెలుస్తోంది. కొంతమందైతే ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయిద్దామని... బీజేపీతో కొనసాగితే నష్టపోతామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. వారికి సర్థిచెప్పిన బాబు... తొందరపడొద్దని చెప్పారు. మనం అసంతృప్తిగా ఉన్న విషయాన్ని కేంద్రానికి తెలియజేద్దామని శాంతింపచేసినట్లు సమాచారం. పోరాటంలో ఇది తొలి అడుగు మాత్రమేనని... కేంద్రం వైఖరి చూశాక నిర్ణయం తీసుకుందామన్నారట.
పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలని ఎంపీలకు టీడీపీ అధినేత సూచించినట్లు తెలుస్తోంది. ఏపీ సమస్యలు అందరికి తెలిసేలా పోరాడాలని చెప్పారట. రెండు నెలల పాటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి... వేచి చూడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను కేంద్రమంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ప్రధానంగా ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని... బడ్జెట్లో ప్రత్యేకంగా ఏమీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో గళమెత్తుతామని చెప్పారు. అలాగే బాబుకు అమిత్ షా ఫోన్ చేశారన్న వార్తలు నిజం కాదన్నారు.
ప్రస్తుతానికి బీజేపీతో విడాకులు లేనట్లేనని ఎంపీ జేసీ వ్యాఖ్యానించారు. ఎంపీలందరం అసంతృప్తిగా ఉన్నామని... తమ దూకుడుకు చంద్రబాబు కళ్లెం వేస్తున్నారన్నారు. ఆందోళనలు, నిరసనలకు కూడా స్పందించకుంటే ఫైనల్గా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తామన్నారు.
పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలని ఎంపీలకు టీడీపీ అధినేత సూచించినట్లు తెలుస్తోంది. ఏపీ సమస్యలు అందరికి తెలిసేలా పోరాడాలని చెప్పారట. రెండు నెలల పాటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి... వేచి చూడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను కేంద్రమంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ప్రధానంగా ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని... బడ్జెట్లో ప్రత్యేకంగా ఏమీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో గళమెత్తుతామని చెప్పారు. అలాగే బాబుకు అమిత్ షా ఫోన్ చేశారన్న వార్తలు నిజం కాదన్నారు.
ప్రస్తుతానికి బీజేపీతో విడాకులు లేనట్లేనని ఎంపీ జేసీ వ్యాఖ్యానించారు. ఎంపీలందరం అసంతృప్తిగా ఉన్నామని... తమ దూకుడుకు చంద్రబాబు కళ్లెం వేస్తున్నారన్నారు. ఆందోళనలు, నిరసనలకు కూడా స్పందించకుంటే ఫైనల్గా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తామన్నారు.