యాప్నగరం

విషాదంలో టీడీపీ.. చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఆ పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

TNN 7 Feb 2018, 9:23 am
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఆ పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో ఉన్న గాలి పార్థివదేహానికి టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. కేర్ ఆస్పత్రికి చేరుకున్న టీడీపీ నేతలు గాలి మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వరరావు, హరికృష్ణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టి.టీడీపీ అధ్యక్షుడు రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకుని గాలి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. అలాగే వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన చాలా మంది నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
Samayam Telugu chandrababu naidu and tdp leaders condolences to gali muddu krishnama naidu family
విషాదంలో టీడీపీ.. చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి


చంద్రబాబు సంతాపం..
గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని షాక్ అయ్యానని, ముద్దుకృష్ణమ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. టీడీపీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. గాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చంద్రబాబు, ముద్దుకృష్ణమ.. ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన నేతలే. కాగా, ముద్దుకృష్ణమ స్వగ్రామమైన వెంకట్రామాపురంలో జరగనున్న ఆయన అంత్యక్రియలకు చంద్రబాబు హాజరుకానున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.