యాప్నగరం

బీచ్ మే దంగల్: నిరసనలో నేనూ పాల్గొంటా!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూసి రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ప్రతిపక్ష నేత,

Samayam Telugu 25 Jan 2017, 11:45 am
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూసి రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ప్రతిపక్ష నేత, వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ దావోస్, సింగపూర్, హాంకాంగ్ అంటూ తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు.
Samayam Telugu chandrababu naidu enjoys public money by visiting countries
బీచ్ మే దంగల్: నిరసనలో నేనూ పాల్గొంటా!


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తమ పార్టీ ఆధ్వర్యంలో జనవరి 26న క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తుందని, దానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దారుణమని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తామంటే కేసులు బనాయిస్తామని పోలీసులు హెచ్చరించడం దారుణమని చెప్పిన జగన్... చంద్రబాబుపై టాడా కేసు విధించి..జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ బీచ్ లో జరిగే పోరాటంలో తాను కూడా పాల్గొంటానని అన్నారు.

బ్రిటీష్ కాలంలో చంద్రబాబు ఉండి ఉంటే మనకెందుకు స్వాతంత్ర్యం తెల్లదొరలు పాలిస్తారని అనేవారని జగన్ హెద్దేవా చేశారు.

‘‘రూ.7కోట్ల ప్రజాధనంతో చంద్రబాబు దావోస్ వెళ్లారు. అక్కడ నాలుగు కుర్చీలు వేసుకొని దాన్నే స్టాల్ గా చేసి..మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ అందర్నీ బతిమాలాడు. ఇది దారుణం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చితే ఆయన ఏ దేశం వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని జగన్ మీడియాతో వ్యాఖ్యానించారు.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్ర రాష్ట్రాలు హామీ ఇచ్చాయని...మోదీని ఒప్పించలేకపోయిన టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.