యాప్నగరం

సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోనున్న లోకేశ్.. చంద్రబాబు కీలక నిర్ణయం!

TDP సోషల్ మీడియా బాధ్యతలను ఇకపై నారా లోకేశ్‌ పర్యవేక్షించనున్నారు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 19 Jul 2019, 6:34 pm
మాజీ మంత్రి లోకేశ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలు ఆయనకు అప్పగించారు. లోకేశ్ ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియా టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీకి సంబంధించిన విషయాలు, ఇతర రాజకీయ అంశాలపై పోస్టులు చేయడాన్ని పర్యవేక్షించనున్నారు. వారికి కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందిస్తారు.
Samayam Telugu Lokesh
నారా లోకేశ్


లోకేశ్‌కు చంద్రబాబు అప్పగించిన బాధ్యతలు చూస్తే కొంత మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా విభాగం చాలా కీలకమైంది. సమకాలీన రాజకీయాలు ఎక్కువగా దాని మీదే ఆధారపడి సాగుతున్నాయి. ఎన్నికల వేళ ఇది మరింత ప్రభావం చూపుతోంది. అలాంటి ప్రభావవంతమైన విభాగాన్ని లోకేశ్ అయితేనే సమర్థంగా నిర్వహించగలరని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది.

లోకేశ్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. టీడీపీ అధికారపక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిపోయాక ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పటి కంటే ప్రతిపక్ష నేతగా లోకేశ్ తన గళం బాగా వినిపిస్తున్నారని పార్టీలోనూ చర్చించుకుంటున్నారు. లోకేశ్ ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.