యాప్నగరం

పవన్‌కు కౌంటర్.. ఏ విచారణకైనా రెడీ: బాబు

ఏపీ శాసనమండలి ఇవాళ హాట్ హాట్‌గా సాగింది. పోలవరం ప్రాజెక్ట్, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సభలో చర్చించారు. చర్చలో భాగంగా తన కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు. రాజకీయాల్లో ఏ రోజు లాలూచీ పడలేదని... తాను కాని... కుటుంబ సభ్యులు కాని అవినీతికి పాల్పడలేదన్నారు చంద్రబాబు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమన్నారు.

Samayam Telugu 22 Mar 2018, 5:55 pm
ఏపీ శాసనమండలి ఇవాళ హాట్ హాట్‌గా సాగింది. పోలవరం ప్రాజెక్ట్, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సభలో చర్చించారు. చర్చలో భాగంగా తన కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు. రాజకీయాల్లో ఏ రోజు లాలూచీ పడలేదని... తాను కాని... కుటుంబ సభ్యులు కాని అవినీతికి పాల్పడలేదన్నారు చంద్రబాబు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమన్నారు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం స్థాపించిన సంస్థ ప్రభుత్వం నుంచి లబ్థి పొందుతుందని విమర్శించడం మంచి పద్దతి కాదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కుట్రలు జరుగుతున్నాయన్ని ఆరోపించారు ఏపీ సీఎం. ఇచ్చేవాడికి తీసుకునే వాడు లోకువ అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్ట్ పునరావాసం బాధ్యతలు రాష్ట్రం తీసుకుటుందని పవన్ ఎలా అంటారన్న బాబు... ఆయన ఇష్టానుసారం మాట్లాడుతుంటే బీజేపీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.
Samayam Telugu Chandra Babu Naidu


వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు. ఓ ఆర్థిక నేరస్తుడికి పీఎంవోలో ఏం పని అని ప్రశ్నించారు. అవినీతిపరులు ప్రధానిని కలిస్తే ఎలా అర్థం చేసుకోవాలని... పీఎంవో చుట్టూ తిరిగే విజయసాయిరెడ్డి తనను బోనులో పెట్టిస్తానంటుంటే ఎలాంటి సంకేతాలు వెళతాయన్నారు. ఆయన్ను పీఎంవో చుట్టూ తిప్పుకోవడమే కాదు... కాపురం పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.