ప్రజా బలం లేకపోతే తిప్పలు తప్పవంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతలు మాత్రమే ప్రజా క్షేత్రంలో నిలబడగలరన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే ఉదహరణగా తీసుకోవాలంటూ తెలుగు తమ్ముళ్లకు పరోక్షంగా హెచ్చరికలు పంపారు. బుధవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు.. తాజా రాజకీయాలు, టీడీపీ బలోపేతంపై చర్చించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వడం లేదని గుర్తు చేశారు చంద్రబాబు. స్వయం కృతాపరాధమే దీనికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదన్నారు. సమర్ధంగా పనిచేసినంత వరకే ప్రజలు ఆదరిస్తారని.. ప్రజా సేవ విషయంలో తనతో సహా ఎవరికీ మినహాయింపు ఉండదని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పటిష్టంగా ఉండాలని.. నేతలంతా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు ఇప్పటి వరకు 16,21,738కు చేరుకుందని.. నమోదులో ఇంకా వేగం పెంచాలన్నారు.
గత నాలుగున్నరేళ్లలో ఎంతో మందికి పదవులు ఇచ్చామని.. రాబోయే 5 ఏళ్లలో ఇంతకు మించి పదవులు వస్తాయన్నారు చంద్రబాబు. అభివృద్ధే మనందరి కులమని.. పేదల సంక్షేమమే మన మతమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు కుల, మత విభేదాలతో రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన ఒకే తానులో మొక్కలని.. జగన్, కేసీఆర్, పవన్ కళ్యాణ్ ఎజెండా కూడా ఒక్కటనేన్నారు. ఈ ముగ్గురు మోదీని విమర్శించరని.. టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకుండా చేయాలనేదే వీరి లక్ష్యమన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వడం లేదని గుర్తు చేశారు చంద్రబాబు. స్వయం కృతాపరాధమే దీనికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదన్నారు. సమర్ధంగా పనిచేసినంత వరకే ప్రజలు ఆదరిస్తారని.. ప్రజా సేవ విషయంలో తనతో సహా ఎవరికీ మినహాయింపు ఉండదని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పటిష్టంగా ఉండాలని.. నేతలంతా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు ఇప్పటి వరకు 16,21,738కు చేరుకుందని.. నమోదులో ఇంకా వేగం పెంచాలన్నారు.
గత నాలుగున్నరేళ్లలో ఎంతో మందికి పదవులు ఇచ్చామని.. రాబోయే 5 ఏళ్లలో ఇంతకు మించి పదవులు వస్తాయన్నారు చంద్రబాబు. అభివృద్ధే మనందరి కులమని.. పేదల సంక్షేమమే మన మతమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు కుల, మత విభేదాలతో రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన ఒకే తానులో మొక్కలని.. జగన్, కేసీఆర్, పవన్ కళ్యాణ్ ఎజెండా కూడా ఒక్కటనేన్నారు. ఈ ముగ్గురు మోదీని విమర్శించరని.. టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకుండా చేయాలనేదే వీరి లక్ష్యమన్నారు.