యాప్నగరం

కర్నూలు జిల్లా నేతలపై బాబు సీరియస్.. అఖిలప్రియ, ఏవీతో భేటీ

కర్నూలు జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్మలాటలపై చంద్రబాబు స్పందించారు. మంత్రి అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య వైరంపై ఆయన సీరియస్ అయ్యారట.

Samayam Telugu 12 Apr 2018, 4:17 pm
కర్నూలు జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్మలాటలపై చంద్రబాబు స్పందించారు. మంత్రి అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య వైరంపై ఆయన సీరియస్ అయ్యారట. ఈ పంచాయితీ సంగతి చూడమని మంత్రి కాల్వ శ్రీనివాసుల్ని ఆదేశించగా... ఆయన ఈ గొడవపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌కు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడే పరిస్థితి కనిపించకపోవడంతో... చంద్రబాబును కలిస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారట. అందుకే అధినేతను కలవాలని సూచించడంతో... వారు అమరావతిలో భేటీకానున్నారట.
Samayam Telugu Kurnool


కొద్ది రోజులుగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏవీ నిర్వహించే కార్యక్రమాలకు వెళ్లొద్దని అఖిల పార్టీ నేతలకు చెప్పినట్లు ప్రచారం జరిగింది. అలాగే ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన సుబ్బారెడ్డి... మంత్రి తీరుపై విరుచుకుపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా వీరి మధ్య అంతరం పెరగ్గా... అధినేత సర్థిచెప్పారు. మళ్లీ ఇప్పుడు రెండు వర్గాల మధ్య రగడ మొదలవ్వడంతో... దీనికి చెక్ పెట్టే పనిలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.