యాప్నగరం

ఎన్డీఏలో చేరడానికి వైసీపీ తహతహ: చంద్రబాబు

ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి వైసీపీ తహతహలాడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో శ‌నివారం (జులై 14) ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ.. వైసీపీది లోపల విశ్వాసం.. బయట అవిశ్వాసమని అన్నారు.

Samayam Telugu 14 Jul 2018, 10:08 pm
ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి వైసీపీ తహతహలాడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో శ‌నివారం (జులై 14) ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ.. వైసీపీది లోపల విశ్వాసం.. బయట అవిశ్వాసమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి జగన్ ఎదురు చూస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీని కేంద్రంలోని పెద్దలే ప్రభుత్వంలోకి ఆహ్వానించినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు.
Samayam Telugu ap cm


జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని.. తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే శనివారం సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.