యాప్నగరం

‘ఎన్డీయే మీట్‌’కు చంద్రబాబు నాయుడు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (సోమవారం) ఢిల్లీ బయలుదేరనున్నారు.

Samayam Telugu 9 Apr 2017, 9:00 pm
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (సోమవారం) ఢిల్లీ బయలుదేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశంలో బాబు పాల్గొంటారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక భాగస్వామ్య పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
Samayam Telugu chandrababu naidu to leave for delhi for nda meet
‘ఎన్డీయే మీట్‌’కు చంద్రబాబు నాయుడు


ఈ సమావేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల తీరుతెన్నుల చర్చించనున్నారు. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యస్థీకరణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ యేడాది జూలైలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగుస్తుంది.

నోట్లరద్దు అనంతరం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధగా అమలు చేస్తున్న డిజిధన్ పథకంపై కూడా మోదీ సమీక్ష జరిపే అవకాశం కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.