యాప్నగరం

పోలవరాన్ని 28వసారి సందర్శించనున్న చంద్రబాబు

పోలవరం చేరుకున్నాక స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలోని 26వ బ్లాక్‌ వద్దకు వెళ్లి, అక్కడి ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు.

Samayam Telugu 21 Oct 2018, 11:05 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 22న(సోమవారం) ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును 28వ సారి సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన నిమిత్తం ప్రాజెక్టు వద్ద కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం హిల్‌ వ్యూకు హెలికాప్టర్‌‌లో చేరుకుంటారు. పోలవరం చేరుకున్నాక స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలోని 26వ బ్లాక్‌ వద్దకు వెళ్లి, అక్కడి ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు.
Samayam Telugu Chandrababu Naidu


ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం కెల్లర్‌ సంస్థ ప్రాంగణంలో ఎగువ కాపర్ డ్యామ్‌ పనులకు సంబంధించిన ఫొటో గ్యాలరీని చంద్రబాబు వీక్షిస్తారు. అక్కడ నుంచి ప్రాజెక్టు కొండపై ఉన్న క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుంటారు. జలవనరుల, అర్‌ అండ్‌ ఆర్‌ శాఖల అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం సందర్శన పూర్తి చేసుకుని చంద్రబాబు మధ్యాహ్నాం హెలీకాప్టర్‌లో అమరావతి వెళ్తారు. రాజధానిలో యథావిధిగా చంద్రబాబు కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.