యాప్నగరం

కాలకేయుడి కిలికిలి భాషలో అమిత్‌ షా లేఖ: డొక్కా

ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖ అబద్ధాల పుట్ట అని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత దేశానికి కాబోయే ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు నిర్ణయించబోతున్నారని జోస్యం చెప్పారు.

Samayam Telugu 25 Mar 2018, 3:03 pm
ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖ అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. ఆదివారం (మార్చి 25) ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాహుబలి సినిమాలో కాలకేయుడు పలికిన కిలికిలి భాషలో అమిత్‌ షా లేఖ ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అబద్దాల ఫ్యాక్టరీలో తయారైన ఆ లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
Samayam Telugu Dokka
డొక్కా మాణిక్య వరప్రసాద్


మాట వినని వారిపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ కేసులంటూ బెదిరిస్తోందని మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ప్రత్యేక హోదానే దేశ రాజకీయాలను శాసిస్తుందని, రాబోయే సాధారణ ఎన్నికల తర్వాత దేశానికి కాబోయే ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడే నిర్ణయించబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.