యాప్నగరం

దేవినేని నెహ్రూకు చంద్రబాబు నివాళి

దేవినేని నెహ్రూ పార్థివదేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ లు నివాళులు అర్పించారు.

Samayam Telugu 17 Apr 2017, 6:44 pm
దేవినేని నెహ్రూ పార్థివదేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నెహ్రూ చనిపోయారంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. నెహ్రూ ఒక వ్యవస్థలా పనిచేశారని, టీడీపీ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు.
Samayam Telugu chandrababu pays tributes to devineni nehru
దేవినేని నెహ్రూకు చంద్రబాబు నివాళి


ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగిన నెహ్రూ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని బాబు అన్నారు.

ఎన్టీఆర్ ఏ ఆశయం కోసం పార్టీని స్థాపించారో అదే ఆశయం కోసం పనిచేస్తానని నెహ్రూ తనతో పదేపదే చెప్పేవారని బాబు గుర్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.