యాప్నగరం

బడి ఎగ్గొడితే ఎలా.. ఎంపీ జేసీకి బాబు సెటైర్

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఆసక్తికర సన్నివేశం హాట్ టాపిక్ అయ్యింది. పార్లమెంట్‌కు వెళ్లాల్సిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో ప్రత్యక్షమయ్యారు. తర్వాత సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. అప్పుడు జేసీని చూసి బాబు... బడి ఎగ్గొడితే ఎలా... ఫెయిల్ అవుతారన్నారు.

Samayam Telugu 12 Mar 2018, 3:05 pm
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఆసక్తికర సన్నివేశం హాట్ టాపిక్ అయ్యింది. పార్లమెంట్‌కు వెళ్లాల్సిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో ప్రత్యక్షమయ్యారు. తర్వాత సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. అప్పుడు జేసీని చూసి బాబు... బడి ఎగ్గొడితే ఎలా... ఫెయిల్ అవుతారన్నారు. అంటే పార్లమెంట్‌కు వెళ్లికపోతే ఎలా అనే అర్థం వచ్చేలా. దీనిపై జేసీ కూడా స్పందించారు. తానెప్పుడు ఫెయిల్ కానని... బడి ఎగ్గొటిన వారు బ్యాక్ బెంచ్‌లో కూర్చున్న వారు ఉన్నత స్థానానికి ఎదిగారన్నారట. వెంటనే చంద్రబాబు నవ్వారట.
Samayam Telugu chandrababu satires on mp jc diwakar reddy
బడి ఎగ్గొడితే ఎలా.. ఎంపీ జేసీకి బాబు సెటైర్


అంతేకాదు చంద్రబాబును కలిశాక అంసెబ్లీ మీడియా పాయింట్‌కు వెళ్లారు. అక్కడ అందరితో చిట్ చాట్‌గా మాట్లాడారు. ఢిల్లీలో పరిణామాలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై స్పందించారు. ఇంతలో ఎవరో మీరు రాజ్యసభకు ఏమైనా వెళతారా అని ప్రశ్నించారట. దీనిపై స్పందించిన జేసీ... ఆ ఆలోచన లేదయ్యా అంటూ సమాధానమిచ్చారట. ఎంపిక చేసి చట్ట సభల్లోకి వెళ్లడానికి... ఎన్నిక ద్వారా వెళ్లడానికి చాలా తేడా ఉందని... ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు జేసీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.