యాప్నగరం

ఏపీలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం

తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్ మళ్లీ ఏపీలో ప్రత్యక్షమయ్యింది. ఓ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించి... యజమాని అలర్ట్ కావడంతో పారిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఘటనతో మళ్లీ జనాలు వణికిపోతున్నారు.

Samayam Telugu 24 Mar 2018, 3:23 pm
తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్ మళ్లీ ఏపీలో ప్రత్యక్షమయ్యింది. ఓ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించి... యజమాని అలర్ట్ కావడంతో పారిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఘటనతో మళ్లీ జనాలు వణికిపోతున్నారు. శాంతినగర్ 8వరోడ్డులో న్యాయవాది సత్యనారాయణ ఇంట్లో కింది పొర్షన్‌లో ఆక్వా రైతు రామకృష్ణ ఉంటున్నారు. అయితే అర్థరాత్రి సమయంలో ఆరుగు వ్యక్తులు ఇంటి ఆవరణలోకి వచ్చారు. ఓ బైక్‌ను ఇంటి తలుపుకు అడ్డంగా పెట్టారు. తర్వాత తలుపును పగలగొట్టేందుకు ప్రయత్నించగా... ఇంటి రామకృష్ణకు మెలుకువ వచ్చింది. వెంటనే ఆయన కేకలు వేశారు... తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు.
Samayam Telugu Cheddi Gang


బైక్ అడ్డుపెట్టి ఉండటంతో రామకృష్ణ బయటకు రాలేకపోయారు. వెంటనే పోలీసులకు కూడా ఫోన్ చేశారు. అయితే వారి నుంచి స్పందన రాలేదు. అయినా ఆ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లలేదు. చివరికి ఇరుగు పొరుగు వారికి ఫోన్లు చేయడంతో వారంతా అక్కడికి వచ్చారు. వెంటనే దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తర్వాత విషయం తెలుసుకున్న డీఎస్పీ ఈశ్వరరావు స్పాట్‌కు వెళ్లారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా అది చెడ్డీ గ్యాంగ్ పనని తేలింది. ముందస్తు జాగ్రత్తగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.