యాప్నగరం

చెన్నూరు టిక్కెట్ లొల్లి.. మాజీ ఎమ్మెల్యే ఓదెలు స్వీయ నిర్బంధం

మంచిర్యాల జిల్లా చెన్నూరు టీఆర్ఎస్ టిక్కెట్ పంచాయితీ. బాల్క సుమన్‌కు టిక్కెట్ కేటాయించడంపై తాజా మాజీ ఎమ్మెల్యే ఓదెలు మనస్తాపం. కుటుంబంతో సహా స్వీయ గృహ నిర్బంధం

Samayam Telugu 11 Sep 2018, 2:17 pm
టీఆర్ఎస్‌లో టిక్కెట్ల పంచాయితీ హీట్ పెంచుతోంది. తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో.. మనస్తాపంగా ఉన్న చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. మందమర్రిలోని తన నివాసంలో కుటుంబంతో కలిసి నిర్బంధంలో ఉన్నారు. ఓదెలు తన భార్య, కుమారుడు, కుమార్తె, తల్లితో కలిసి ఇంట్లో తాళాలు వేసుకొని నిర్బంధించుకున్నారు. తనకు టిక్కెట్ కేటాయింపుపై హామీ ఇస్తేనే నిర్బంధం నుంచి బయటకు వస్తానన్నారు. ఓదెలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో అనుచరులు, కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్నారు. ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Samayam Telugu Odelu


మరోవైపు 24 గంటల్లో సానుకూలంగా స్పందన రాకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు ఓదెలు. 2009 నుంచి పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డానని.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. మొదటి జాబితాలో సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇచ్చి తనకు నిరాకరించడం బాధగా ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తనకు దేవుడితో సమానమని.. కొందరు వ్యక్తుల వల్ల తనకు టిక్కెట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ రద్దైన రోజే 105మందితో కేసీఆర్ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ లిస్ట్‌లో చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఓదెలుకు టిక్కెట్ నిరాకరించారు. ఆ స్థానం నుంచి ఎంపీ బాల్క సుమన్‌కు టిక్కెట్ కేటాయించారు. దీనిపైనే ఓదెలు మనస్తాపంతో ఉన్నారు. కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.