యాప్నగరం

చీఫ్‌ విప్ పల్లె రఘునాథ రెడ్డి సతీమణి కన్నుమూత

ఏపీ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి సతీమణి పల్లె ఉమ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమా దేవి బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Samayam Telugu 30 Aug 2018, 11:11 pm
ఏపీ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి సతీమణి పల్లె ఉమ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమా దేవి.. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం (ఆగస్టు 30) సాయంత్రం ఆమె అరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. బాలాజీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ పేరుతో ఉమాదేవి విద్యాసంస్థలను స్థాపించారు. ఉమా దేవి మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Samayam Telugu basava


నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది పిల్లలకు ఉమా దేవి ఉచితంగా విద్య అందించారు. ఆమె చేసిన సేవ రఘునాథరెడ్డికి రాజకీయంగానూ ఉపయోగపడింది. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో రఘునాథరెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారం కూడా నిర్వహించారు. ఉమా దేవి మృతితో అనంతపురంలోని పుట్టపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కుటుంబసభ్యులతో ఉమ (ఫైల్ ఫొటో)


బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లె రఘునాథరెడ్డిని పరామర్శించారు. సీఎంతో ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.