యాప్నగరం

హైదరాబాద్: కిడ్నాప్ వదంతులు.. అమాయకుడిపై దాడి

పిల్లల కిడ్నాప్ వదంతులకు బ్రేక్ పడటం లేదు. వదంతులతో రోజూ ఎక్కడో ఓ చోట అమాయకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో కిడ్నాపర్ అనే అనుమానంతో ఓ అమాయకుడ్ని స్థానికులు చితకబాదారు.

Samayam Telugu 30 Jul 2018, 10:29 am
పిల్లల కిడ్నాప్ వదంతులకు బ్రేక్ పడటం లేదు. వదంతులతో రోజూ ఎక్కడో ఓ చోట అమాయకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో కిడ్నాపర్ అనే అనుమానంతో ఓ అమాయకుడ్ని స్థానికులు చితకబాదారు. వినాయక్ నగర్‌ ఏరియాలో కొంతమంది పిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటున్నారు. ఈలోపు ఓ వ్యక్తి ఆడుకుంటున్న పిల్లల్లో ఒకరిని ఎత్తుకున్నాడు. ఇదంతా గమనించిన స్థానికులు కొంతమంది స్పాట్‌కు వెళ్లారు. అతడ్ని పట్టుకొని నిలదీయగా.. జనాలంతా గుమ్మిగూడటంతో పాపం ఆ వ్యక్తి భయపడ్డాడు.
Samayam Telugu Attack.


అతడ్ని కిడ్నాపర్‌గా స్థానికులు అనుమానించారు. పిల్లల్ని ఎత్తుకెళ్లడానికి వచ్చాడని అనుమానించి చితకబాదారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు స్పాట్‌కు వచ్చి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆ వ్యక్తిని నేరెడ్‌మెట్ చంద్రగిరికి చెందిన ఎలక్ట్రీషియన్ సుధాకర్‌గా గుర్తించారు. అసలు అక్కడ ఏం జరిగిందా అని ఆరా తీస్తే.. సుధాకర్ జరిగిందంతా చెప్పాడు. పిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటున్నారని.. అదే సమయంలో ఓ బాలుడు ఆడుకుంటూ, ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడని చెప్పాడు.

పిల్లవాడు రోడ్డుపై ఉండటంతో తనకు భయమేసిందని.. వాహనాలు వచ్చే ప్రమాదం ఉండటంతోనే ఎత్తుకొని రోడ్డు పక్కన వదిలేయాలనుకున్నాని చెప్పాడు. ఈలోపే స్థానికులంతా వచ్చి కిడ్నాపర్‌గా అనుమానించి దాడి చేశారన్నాడు. సుధాకర్ గురించి స్థానికంగా కూడా ఆరా తీసిన పోలీసులు.. అతడికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడంతో తహశీల్దారుకు బైండోవర్ చేశారు. స్థానికుల దాడిలో బాధితుడికి స్వల్పంగా గాయాలయ్యాయి.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.