యాప్నగరం

విషాదం: చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్

ప్లీజ్ ఇలా చేయండి: మీ పిల్లలను పాఠశాల బస్సు లేదా ఆటోలు ఎక్కించే ముందు.. వారిని చూసుకునేందుకు అందులో టీచర్లు గానీ, సహాయకులు గానీ ఎవరైనా ఉన్నారా లేదా గమనించండి. అలా లేనట్లయితే.. వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించండి. అంజలి పరిస్థితి మరే చిన్నారికి రాకుండా జాగ్రత్తపడండి.

TNN 20 Jan 2018, 12:07 pm
చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లే బస్సులే వారి పాలిట మృత్యు శకటాలు అవుతున్నాయి. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అంజలి శనివారం ఉదయం స్కూలుకు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అయితే, ఆ బస్సు డోర్ వద్ద కాపలాగా ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారి మెట్ల వద్దకు వచ్చింది.
Samayam Telugu child killed in school bus accident near vansthalipuram
విషాదం: చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్


అదే సమయంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆమె బస్సు నుంచి కిందపడింది. అది గమనించని డ్రైవర్ బస్సు ముందుకు నడపడంతో వెనుక చక్రం ఆమె తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తమ చిన్నారి మృత్యువాత చెందడం పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

కేజీ నుంచి ఐదో తరగతి చదివే పిల్లలను తీసుకొచ్చే బస్సుల్లో డోర్ల వద్ద కాపాలాగా సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయంలో కొన్ని పాఠశాలలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. చిన్నారి మృతికి కారణమైన స్కూల్ బస్సును స్వాధీనం చేసుకోవడంతో పాటు, పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.

ప్లీజ్ ఇలా చేయండి: మీ పిల్లలను పాఠశాల బస్సు లేదా ఆటోలు ఎక్కించే ముందు.. వారిని చూసుకునేందుకు అందులో టీచర్లు గానీ, సహాయకులు గానీ ఎవరైనా ఉన్నారా లేదా గమనించండి. అలా లేనట్లయితే.. వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించండి. అంజలి పరిస్థితి మరే చిన్నారికి రాకుండా జాగ్రత్తపడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.