యాప్నగరం

చిలుకూరు బాలాజీ! బ్యాంకులను కాపాడు.. ప్రత్యేక పూజ

చిలుకూరు బాలాజీ ఆలయంలో సోమవారం ‘రుణ విమోచన పూజలు’ చేశారు. విఫలమైన బ్యాంకింగ్ వ్యవస్థను సరైన దారిలో పెట్టాలని నరసింహ స్వామిని వేడుకున్నారు.

TNN 20 Feb 2018, 6:54 pm
రోజుకో కుంభకోణంతో బ్యాంకింగ్ దిగ్గజాలన్నీ సంక్షోభం బారిన పడుతున్న ఉదంతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఏ ఇద్దరు వ్యక్తులు తారసపడ్డా చర్చ ఈ అంశంపైనే. అయితే దేశమంతా చర్చలతోనే సరిపెడుతోంటే.. చిలుకూరు బాలాజీ ఆలయం మాత్రం ఓ అడుగు ముందుకేసింది. బ్యాంకుల్లో సంక్షోభాలన్నీ తొలగిపోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Samayam Telugu chilkur balaji temple holds special prayers for solving banking crisis
చిలుకూరు బాలాజీ! బ్యాంకులను కాపాడు.. ప్రత్యేక పూజ


రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో సోమవారం (ఫిబ్రవరి 19) ‘రుణ విమోచన పూజలు’ చేశారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన ‘రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణ మంత్రం’తో ఆలయం మార్మోగింది.

బ్యాంకుల విషయంలో రాజకీయ, ప్రభుత్వాల జోక్యం తగ్గేలా చూడాలని, విఫలమైన బ్యాంకింగ్ వ్యవస్థను సరైన దారిలో పెట్టాలని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో రుణ విమోచన నృసింహ పారాయణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ సౌందరరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.