యాప్నగరం

చిరంజీవిని 93లోనే రాజకీయాల్లోకి రమ్మన్నా!

తమ పార్టీ ఎంపీనే అయినా మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానంపై ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు

TNN 27 Dec 2017, 4:01 pm
తమ పార్టీ ఎంపీనే అయినా మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానంపై ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్. తను చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానించాను అని ఈయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాదు.. 1993లోనే రాజకీయాల్లోకి రావాలని చిరంజీవిని తను పిలిచాను అని చింతామోహన్ అన్నారు. ఒకవేళ అప్పట్లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే కచ్చితంగా సక్సెస్ అయ్యే వారు.. అని ఈ మాజీ ఎంపీకి చెప్పుకురావడం విశేషం. అయితే తన మాటను చిరంజీవి అప్పట్లో పట్టించుకోలేదని... తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేకపోయారని చింతా అభిప్రాయపడ్డారు.
Samayam Telugu chinta mohan interesting comments on chiranjeevi
చిరంజీవిని 93లోనే రాజకీయాల్లోకి రమ్మన్నా!


ఉన్నట్టుండి మెగాస్టార్ పొలిటికల్ కెరీర్ పై ఈ కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరదూరంగానే ఉంటున్నారు. సినిమాల మీదే ఆయన కాన్సన్ ట్రేషన్ చేశారు. రాజకీయ ప్రకటనలకు కానీ, విమర్శలకు, ప్రతి విమర్శలకు చిరంజీవి పూర్తి దూరం అయ్యారు. ఖైదీ నంబర్ 150తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇలాంటి నేఫథ్యంలో ఆయన గురించి చింతా మోహన్ రాజకీయ వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం.

అలాగే తెలుగుదేశం, బీజేపీలపై కూడా చింతా మోహన్ విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని చింతా అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో చంద్రబాబు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని.. అయినా ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.