యాప్నగరం

దాసరికి చిరంజీవి పరామర్శ

తీవ్ర అస్వస్థతతో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు కిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

TNN 3 Feb 2017, 12:58 pm
తీవ్ర అస్వస్థతతో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు కిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఊపిరితిత్తుల సమస్యతో పాటూ రెండు కిడ్నీలు ఫెయిలైనట్టు వైద్యులు తెలిపారు. రెండు కిడ్నీలకు డయాలసిస్ చేయడంతో పాటూ, ఊపిరితిత్తులకు రెండు రోజుల క్రితమే ఆపరేషన్ నిర్వహించినట్టు చెప్పారు. ప్రస్తుతం దాసరి కిమ్స్ ఆసుపత్రిలోనే అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. సినీప్రముఖులు శుక్రవారం ఉదయం దాసరిని పరామర్శించి వచ్చారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. చిరంజీవి, అల్లు అరవింద్, వీవీ వినాయక్, మోహన్ బాబు, జయసుధ వంటి ప్రముఖులు పరామర్శించారు. దాసరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు.
Samayam Telugu chiranjeevi visits dasari narayana rao in kims hospital
దాసరికి చిరంజీవి పరామర్శ


దాసరి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.