తప్పుచేసిన వారిని మందలించి సరైన మార్గంలో నడిపించి, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఖాకీలే వీధిన పడ్డారు. ఓ మహిళ ఏఎస్పీ, సీఐ వివాహేతర సంబంధం బట్టబయలైంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో బయటపడిన ఈ ఘటన కలకలం రేపింది. కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ, ఏసీబీ ఏఎస్పీగా పనిచేస్తున్న మహిళ పోలీస్ భర్త, తన బంధువులతో కలిసి అతడిపై దాడికి దిగాడు. మాదాపూర్లోని ఓ ఇంట్లో తన భార్యతో ఉన్న సీఐని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఆయన, నడిరోడ్డుపైనే సీఐని చితక్కొట్టాడు. అంతేకాదు ఏఎస్పీ తల్లి, అత్తలు మల్లికార్జున్ రెడ్డిని చెప్పులతో కొట్టారు. వీరంతా కలిసి సీఐని తరిమి తరిమి కొట్టారు. ఈ మొత్తం వ్యవహారం కెమెరాలకు చిక్కింది.
ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తోన్న మీడియా ప్రతినిధిపై సీఐ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకునే సీఐ మల్లిఖార్జున్ను విధుల నుంచి తప్పించాలని ఏఎస్పీ భర్త డిమాండ్ చేశాడు. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతోందని ఆయన ఆరోపించాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే వారిని పట్టుకున్నానని తెలిపాడు. వీరిద్దరి పైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్గా ఉన్నట్టు సమాచారం.
ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తోన్న మీడియా ప్రతినిధిపై సీఐ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకునే సీఐ మల్లిఖార్జున్ను విధుల నుంచి తప్పించాలని ఏఎస్పీ భర్త డిమాండ్ చేశాడు. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతోందని ఆయన ఆరోపించాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే వారిని పట్టుకున్నానని తెలిపాడు. వీరిద్దరి పైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్గా ఉన్నట్టు సమాచారం.