యాప్నగరం

రాజకీయ నాయకులు రాస్కెల్స్: మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు

రాజకీయ నాయకులను ఉద్దేశించి మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను పొగిడిన ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించానని చెప్పారు.

TNN 19 Jan 2018, 4:31 pm
సినీ నటుడు మోహన్ బాబు రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ అని కలెక్షన్ కింగ్ వ్యాఖ్యానించారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం పొలిటీషియన్లకు అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు మాట నిలబడి ఉంటే దేశం ఇంకా మంచి స్థితిలో ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తన కూతురు మంచు లక్ష్మితో కలిసి ఆయన జీవిత విశేషాలను పంచుకున్నారు.
Samayam Telugu cinema hero and producer mohan babu controversial comments on politicians
రాజకీయ నాయకులు రాస్కెల్స్: మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు


తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ మంచి వ్యక్తని, ఆయనకు అంచం అంటే తెలియదని మోహన్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ నన్ను రాజ్యసభకు పంపారు. ఎలాంటి మచ్చా లేకుండా పదవీ కాలాన్ని పూర్తి చేశానని ఆయన తెలిపారు.

సినిమాల్లోకి రాక ముందు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసిన ఆయన.. తనకు ప్రొఫెసర్ బీఆర్ రెడ్డి తనకు సాయం చేశారని చెప్పారు. జీవితంలో తాను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని, శత్రువులు కూడా తనలా ఇబ్బందులు పడొద్దని కోరుకుంటున్నానని మోహన్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.