యాప్నగరం

జగన్ పాదయాత్రకు సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు మద్దతు

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సినిమా ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇటీవల నటులు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీలు జగన్‌ను కలవగా.. తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జైకొట్టారు.

Samayam Telugu 9 Jul 2018, 1:29 pm
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సినిమా ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇటీవల నటులు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీలు జగన్‌ను కలవగా.. తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జైకొట్టారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని సోమేశ్వరంలో ప్రతిపక్ష నేతను కలిశారు. ఆయనతో పాటూ కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు.
Samayam Telugu Chota


తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో 209వ రోజు ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఉదయం సోమేశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభంకాగా.. సీతమ్మ తోట, లొల్ల మీదుగా సాయంత్రానికి రాయవరంకు చేరుకుంటుంది. జగన్‌కు అడుగడునా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు కూడా తమ సమస్యల్ని ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకొస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.