బీజేపీ పిలుపునిచ్చిన ‘ఛలో ప్రగతి భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీపీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణను విధించడాన్ని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ ఈ పిలుపునిచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అడ్డుకొని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డిని నగర సీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం బషీర్బాగ్లోని సీపీ కార్యాలయం వద్ద అడ్డుకొని అరెస్టు చేశారు. ఆయణ్ని కంచన్బాగ్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిని అసెంబ్లీ వద్ద అరెస్టు చేశారు.
ఎమ్మెల్సీ రామచందర్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రగతిభవన్కు బయలుదేరిన రామచందర్ రావును తార్నాకలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయమే అయణ్ని గృహ నిర్భందం చేశారు. శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు మండిపడ్డారు.
ఎమ్మెల్సీ రామచందర్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రగతిభవన్కు బయలుదేరిన రామచందర్ రావును తార్నాకలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయమే అయణ్ని గృహ నిర్భందం చేశారు. శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు మండిపడ్డారు.