యాప్నగరం

చిక్కుల్లో సివిల్స్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ

అఖిల భారత సివిల్ సర్వీసిసెస్ (యూపీఎస్సీ) పరీక్షల్లో తప్పుడు అంగవైకల్యం ధ్రువీకరణ పత్రాలు సమర్పించి నేషనల్ లెవల్లో

Samayam Telugu 28 Jun 2017, 10:10 am
అఖిల భారత సివిల్ సర్వీసిసెస్ (యూపీఎస్సీ) పరీక్షల్లో తప్పుడు అంగవైకల్యం ధ్రువీకరణ పత్రాలు సమర్పించి నేషనల్ లెవల్లో మూడో ర్యాంక్ సంపాదించాడని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు... మంగళవారం రోణంకి గోపాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించిన రోణంకిని విచారించి తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కు చెందిన న్యాయవాది మురళీకృష్ణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Samayam Telugu civil services ranker ronanki gopalakrishna served hc notice
చిక్కుల్లో సివిల్స్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ

ఓబీసీ కోటా కింద 110.66, వికలాంగుల కోటాలో 75.34 మార్కులను యూపీఎస్సీ కటాఫ్ మార్కులుగా నిర్ణయించిందని, ఓబీసీ కేటగిరికి చెందిన రోణంకి.. 91.34 మార్కులు సాధించారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగుల కోటాలో ర్యాంకు పొందారని చెప్పారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని గోపాలకృష్ణతో పాటు యూపీఎస్సీ సంయుక్త కార్యదర్శి, కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

అయితే అంగవైకల్యానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలు తన వద్ద ఉన్నాయని.. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటానని రోణంకి చెబుతున్నారు. తనపై బురదజల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.