యాప్నగరం

బీజేపీ సభ్యత్వం తీసుకున్న మాజీఎమ్మెల్యే!

బాబు చేరికతో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

TNN 8 Nov 2017, 8:28 am
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అలియాస్ జయచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇది వరకే బీజేపీలో చేరినట్టుగా ప్రకటించిన ఆయన సతీసమేతంగా మంగళవారం విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు హరిబాబు సీకే బాబుకు సభ్యత్వాన్ని ఇచ్చారు. బాబు చేరికతో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుందని హరిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Samayam Telugu ck babu joins bjp
బీజేపీ సభ్యత్వం తీసుకున్న మాజీఎమ్మెల్యే!


ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం ముఖ్య నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ పాల్గొన్నారు. సీకే బాబుతో పాటు ఆయన భార్య లావణ్య కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు.

గతంలో బాబు కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా కొనసాగారు. ఇటీవలే బీజేపీ నేత పురందేశ్వరి చిత్తూరు జిల్లాలో పర్యటించారు బాబుతో చర్చించి తమ పార్టీలోకి చేర్చుకున్నారు. సొంత జిల్లా వ్యక్తి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బద్ధవ్యతిరేకిగా పేరుంది సీకే బాబుకు. ఇలాంటాయన ఇప్పుడు బీజేపీలో చేరడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.