యాప్నగరం

కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం... హైదరాబాద్‌లో డిష్యుం, డిష్యుం

హైదరాబాద్ అంబర్‌పేటలో ఉద్రిక్తత ఏర్పడింది. పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించే సమయంలో కాంగ్రెస్, సీపీఎం నేతల మధ్య గొడవ జరిగింది.

Samayam Telugu 11 Apr 2018, 12:52 pm
హైదరాబాద్ అంబర్‌పేటలో ఉద్రిక్తత ఏర్పడింది. పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించే సమయంలో కాంగ్రెస్, సీపీఎం నేతల మధ్య గొడవ జరిగింది. అంబర్‌పేటలోని పూలే విగ్రహానికి నివాళులర్పించేందుకు సీపీఎం నేతలు తమ్మినేని, ఎంబీసీ నేత ఆశయ్య వెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అనుచరులు, కార్యకర్తలతో కలిసి అక్కడికి వెళ్లారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకర్ని ఒకరు తోసుకుంటూ... ఘర్షణకు దిగారు. పార్టీ నేతలు వారిస్తున్నా వినిపించుకోలేదు.
Samayam Telugu CPM


ఎంబీసీ నేత ఆశయ్య మీదకు కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లడంతో... పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇరు పార్టీల నేతలు సర్థిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అకారణంగా కాంగ్రెస్ నేతలు తనపై దాడికి ప్రయత్నించారని ఆశయ్య ఆరోపించారు. పూలే అందరివాడని... ఎవరైనా నివాళులు అర్పించే హక్కు ఉందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.