యాప్నగరం

టీడీపీ వర్సెస్ వైసీపీ.. బెజవాడలో ఫ్లెక్సీల రగడ

​విజయవాడలో అర్థరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. చిట్టినగర్‌లో ఫ్లెక్సీల విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య రగడ జరిగింది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీ ఆందోళనతో హైడ్రామా నడిచింది.

Samayam Telugu 14 Apr 2018, 7:59 am
విజయవాడలో అర్థరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. చిట్టినగర్‌లో ఫ్లెక్సీల విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య రగడ మొదలయ్యింది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో గొడవ జరిగింది. సీఎ చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే జగన్ పాదయాత్ర ఇవాళ నగరంలోకి ప్రవేశిస్తుండటంతో ఆ పార్టీ నేతలు కూడా ఫ్లెక్సీలు కట్టారు. అయితే వైసీపీ కార్యకర్తలు తమ ఫ్లెక్సీలను తొలగించారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వారికి పోటీగా వైసీపీ నేతలు కూడా రోడ్డుపై బైఠాయించారు. టీడీపీనే తమ ఫ్లెక్సీలను తీసేశారంటూ నిరసన తెలిపారు.
Samayam Telugu Vja Flexi


ఇరు పార్టీల కార్యకర్తల పోటా పోటీ ఆందోళనలతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. ఇరువురి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ స్పాట్‌కు వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారని... తాము తలచుకుంటే జగన్ సభ ఇక్కడ జరగుతుందా అని ప్రశ్నించారు. కొద్దిసేపటి తర్వాత డీసీపీ రంగంలోకి దిగి జలీల్‌ఖాన్‌తో పాటూ ఇరు పార్టీల కార్యకర్తలకు సర్థిచెప్పడంతో పరిస్థితి సద్ధుమణిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.